AP CM Jagan Delhi Tour: ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం జగన్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీకి అవకాశం..
AP CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తినాలో బిజీ బిజీగా ఉన్నారు. మొదటి రోజు పర్యటనలో ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం జగన్..
AP CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తినాలో బిజీ బిజీగా ఉన్నారు. మొదటి రోజు పర్యటనలో ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం జగన్.. రెండో రోజు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షాతో పాటు గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ను కలవనున్నట్లు సమాచారం. మంత్రులతో భేటీ అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతారు.
రాష్ట్రానికి సంబంధించి పలు పెండింగ్ సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు పీఎంతో చర్చించారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు సీఎం జగన్. సీఎం వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మార్గాని భరత్ రామ్, బాలశౌరి, నందిగం సురేశ్, గోరంట్ల మాధవ్, ఎంవీవీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
Also read:
RBI Recruitment 2022: ఆర్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే?
Realme GT 2 Pro: రియల్మీ తొలి ఫ్లాగ్షిప్ ఫోన్ విడుదలకు సిద్ధం.. ఫీచర్లివే!
Cyber Attack: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. 40 పైసలకు 6 లక్షలు అంటూ భారీ ఝలక్..