ఏపీలో మరిన్ని సడలింపులు.. వాటికి అనుమతి నిరాకరణ

ఏపీలో మరి కొన్నింటికి లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి సడలింపులు ఇస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నగలు, బట్టలు, చెప్పులు తెరిచేందుకు అనుమతిని ఇచ్చింది

ఏపీలో మరిన్ని సడలింపులు.. వాటికి అనుమతి నిరాకరణ

Updated on: May 26, 2020 | 1:50 PM

ఏపీలో మరి కొన్నింటికి లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి సడలింపులు ఇస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నగలు, బట్టలు, చెప్పులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. స్ట్రీట్ ఫుడ్స్‌ సైతం తెరిచి ఉంచుకోవచ్చంటూ తెలిపింది. ఈ సందర్భంగా ఆయా షాపులు అనుసరించాల్సిన విధానాలపై సర్క్యులర్ జారీ చేసింది. పెద్ద షోరూమ్‌లకు వెళ్లాలంటే ముందే ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలని ఆ సర్య్కులర్‌లో పెట్టారు. అన్ని షాపుల్లో ట్రైల్‌ రూమ్‌లకు అనుమతిని నిరాకరించారు. ఇక రోడ్లపై ఆహారం అమ్మేవారు ప్లేట్స్ రూంలో కాకుండా పార్సిల్ సదుపాయం కల్పించాలని ఆదేశాల్లో తెలిపారు. అలాగే ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న వారే ఆహార విక్రయ బండ్లను ఏర్పాటు చేసుకోవచ్చునని ప్రభుత్వం సూచించింది. వీటితో పాటు నగల షాపుల్లో విక్రయించే వారు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని ప్రభుత్వ తాజా ఆదేశాల్లో వివరించారు.

Read This Story Also: ‘బుల్లి వంటగాడు’.. ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాడుగా..!

Loading...
Unable to load recommendations.
Follow Us