
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని వేల్పూరు అనే ఒక చిన్న గ్రామం. అక్కడ తొమ్మిదో తరగతి చదువుతున్న చందు సాయి దుర్గారెడ్డి వయస్సు 13 సంవత్సరాలు. చందుకి నాయకులను చూడటమన్నా, వారితో ఫోటోలు దిగటమన్నా అమితమైన పిచ్చి. ఇప్పటికే చాలా మంది నాయకులతో ఫోటోలు దిగి వాటిని భద్రంగా దాచుకుంటున్నాడు. కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఇలా పలువురు రాజకీయ నాయకులతో ఫోటోలు దిగాడు.
కానీ, అతని మనసులో ఒక పెద్ద కల ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను కలిసి ఎలాగైనా ఒక ఫోటో దిగాలనేదే ఆ బలమైన కోరిక. ఆ కల అతన్ని నిద్రపోనివ్వలేదు. ఇంట్లో చెబితే పంపరని భావించిన చందు, ఎవరికీ చెప్పకుండా సోమవారం (జూలై 13) ఉదయం తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. భీమవరంలో రైలెక్కి, విజయవాడ మీదుగా గుంటూరు జిల్లా తాడేపల్లికి బయలుదేరాడు.
రైలు ప్రయాణంలో మలుపు
రైలు వేగంగా దూసుకుపోతోంది. చందు కళ్లల్లో అమాయకత్వం, గుండెల్లో ముఖ్యమంత్రులను కలవాలనే ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, అంత చిన్న పిల్లాడు ఒంటరిగా ప్రయాణించడం తోటి ప్రయాణికుల దృష్టిని ఆకర్షించింది. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొందరు ప్రయాణికులు చందు దగ్గరకు వచ్చి మెల్లగా మాటలు కలిపారు. బాబూ.. ఎక్కడికి వెళ్తున్నావు? నీతో పాటు పెద్దవాళ్లు ఎవరూ లేరేంటి?” అని ప్రశ్నించారు. దానికి చందు ఏమాత్రం తడబడకుండా, చాలా అమాయకంగా.. “నేను ఉండవల్లిలో చంద్రబాబు గారితో ఫోటో దిగడానికి వెళ్తున్నాను!” అని తన మనసులోని మాటను చెప్పేశాడు.
ఆ చిన్నారి మాటలు విన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంత దూరం ఒంటరిగా రావడం ప్రమాదకరమని గ్రహించిన వారు, బాలుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. “సరే బాబు, మేము నిన్ను సీఎం దగ్గరికే తీసుకెళ్తాం రా” అని నమ్మించి, రైలు దిగాక అతడిని నేరుగా తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. తాడేపల్లి పోలీసులు చందు సాయిని ప్రేమగా దగ్గరకు తీసుకుని విచారించారు. బాలుడి వద్ద ఉన్న సెల్ఫోన్ ద్వారా వెంటనే అతని తల్లికి సమాచారం అందించారు. తన కొడుకు సురక్షితంగా పోలీసుల వద్ద ఉన్నాడని తెలిసి ఆ తల్లి ఊపిరి పీల్చుకుంది.
ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులను కలవాలనే ఆ చిన్నారి అమాయకపు కోరిక, దానికోసం అతను చేసిన సాహసోపేత ప్రయాణం చూసి పోలీసులు కూడా ముక్కున వేలేసుకున్నారు. చందు సాయి కోరిక నెరవేరకపోయినా, తోటి ప్రయాణికుల బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల ఆ బాలుడు క్షేమంగా ఇంటికి చేరుకోగలిగాడు.
ఈ స్టోరీకి హ్యుమన్ ఇంట్రస్ట్ టైటిల్ కావాలి..