‘ఏటీఎం’నే మాయం చేశారు..!
ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ సమీపంలో దొంగలు హల్చల్ చేశారు. దొంగలు కూడా అడ్వాన్స్ అయ్యారు.. ఏకంగా ఏటీఎం మిషన్కే ఎసరు పెట్టారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా..? నిజమండీ..! రెచ్చిపోయిన ఘరానా దోపిడీ దొంగలు ఏటీఎంను మాయం చేశారు. అందులో ఉన్న రూ.8 లక్షల 23 వేలను నగదును లూఠీ చేశారు. డబ్బు డ్రా చేసుకునేందుకు వచ్చిన కస్టమర్లు ఇది చూసి ఖంగుతిన్నారు. హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన.. […]
ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ సమీపంలో దొంగలు హల్చల్ చేశారు. దొంగలు కూడా అడ్వాన్స్ అయ్యారు.. ఏకంగా ఏటీఎం మిషన్కే ఎసరు పెట్టారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా..? నిజమండీ..! రెచ్చిపోయిన ఘరానా దోపిడీ దొంగలు ఏటీఎంను మాయం చేశారు. అందులో ఉన్న రూ.8 లక్షల 23 వేలను నగదును లూఠీ చేశారు.
డబ్బు డ్రా చేసుకునేందుకు వచ్చిన కస్టమర్లు ఇది చూసి ఖంగుతిన్నారు. హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన.. పోలీసులను సైతం విస్తుపోయేలా చేసింది. అయితే.. దీనిని సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లడం ఒకరి, ఇద్దరి వల్ల సాధ్యం కాదని.. ఇది ఖచ్చితంగా ఓ ముఠా పనిగా నిర్ధారించారు. జిల్లాను ఆనుకొని ఉన్న పక్క రాష్ట్రంలో సైతం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాగా.. పోలీస్ క్వార్టర్స్ సమీపంలో దొంగతనం జరగడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దాదాపు 700 కిలోల బరువుండే ఏటీఎం మిషన్ ఎలా ఎత్తుకుపోయారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.