లెక్చరరే కానీ..లెక్కలేనన్ని ఆస్తులు!

తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో మొత్తం 10 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో బంధువుల వద్ద రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న ఫ్లాట్‌ను 24 […]

లెక్చరరే కానీ..లెక్కలేనన్ని ఆస్తులు!
Follow us

|

Updated on: Oct 04, 2019 | 5:24 PM

తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో మొత్తం 10 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో బంధువుల వద్ద రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న ఫ్లాట్‌ను 24 లక్షలు తీసుకుని 8 లక్షలకే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించారు అధికారులు. అంతేకాదు..మరోచోట 1 కోటి 81 లక్షలకు ఇల్లు కొని 91 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. కాగా మధుసూదన్ రెడ్డి అక్రమ ఆస్తులు 40 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది.

దొరికింది రూ.50 లక్షలు కాదు..రూ.1.30 లక్షలు మాత్రమే: మధుసూదన్‌రెడ్డి

మరోవైపు ఏసీబీ దాడులపై మధుసూదన్‌రెడ్డి స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. తనకు బినామీలు ఎవరూ లేరని చెప్పారు. మహేందర్‌రెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. సోదాల్లో రూ.50లక్షలు దొరికాయని వస్తున్న వార్తలు అవాస్తవమని..రూ.1.30లక్షల నగదు మాత్రమే లభించిందని చెప్పారు. తమ కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లోనూ మినిమమ్‌ బ్యాలెన్స్‌ మాత్రమే ఉందన్నారు. ఏసీబీ సోదాలు ఎందుకు జరుగుతున్నాయో తర్వాత చెబుతానని మధుసూదన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.