అన్నం ఎక్కువగా తినేస్తున్నాడని కొడుకును ఇనుప సంకెళ్లతో కట్టేసిన తండ్రి
అన్నం ఎక్కువగా తింటున్నాడని కన్న కొడుకుపై కఠినంగా వ్యవహరించాడు ఓ తండ్రి. రెండు రోజులు ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసి కడుపు మాడ్చాడు. దీంతో అతడు నీరసించి పోవడంతో.. ఇరుగు పొరుగు వారు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ కౌశాంబి జిల్లాలో..
అన్నం ఎక్కువగా తింటున్నాడని కన్న కొడుకుపై కఠినంగా వ్యవహరించాడు ఓ తండ్రి. రెండు రోజులు ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసి కడుపు మాడ్చాడు. దీంతో అతడు నీరసించి పోవడంతో.. ఇరుగు పొరుగు వారు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది.
అసలు వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని సైనీ ప్రాంతంలో కందైలాల్ అనే నిరుపేద కుటుంబం నివసిస్తోంది. వీరు రోజూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూంటారు. పని చేస్తేనే పూట గడుస్తుంది. ఇంట్లో వారంతా పని చేస్తున్నా.. అతని కొడుకు విజయ్ మాత్రం బలాదూర్గా తిరిగే వాడు. తండ్రి పని చేయాలని చెప్పినా కూడా వినిపించుకునే వాడు కాదు. ఈ క్రమంలోనే అతడు ఇంటికి వచ్చి ఎవరికీ అన్నం మిగల్చకుండా తినేశాడు. మిగిలిన ఇంటి సభ్యులు తినడానికి ఇంట్లో బియ్యం కూడా లేకపోవడంతో తండ్రి కోపంతో ఊగిపోయాడు. వెంటనే గొలుసులతో అతన్ని కట్టిపడేశాడు.
ఇక ఈ విషయంపై ఇంటి యజమానిని పోలీసులు ప్రశ్నించారు. ఇంట్లో ఆర్థిక కష్టాలకు తోడు పనిచేయకుండా ఎక్కువ అన్నం తింటున్నాడని ఆ తండ్రి వెల్లడించాడు. అన్నం తిన్నా తనకు బాధ లేదని.. కానీ పని చేసి వచ్చిన వారంతా ఆరోజు ఆకలితో కడుపు మాడ్చుకోవాల్సి వచ్చింది అందుకే కట్టేయాల్సి వచ్చిందని వెల్లడించడంతో వారి పరిస్థితి చూసి పోలీసులు కూడా కరిగిపోయారు.
Read More:
నాసా బంపర్ ఆఫర్.. మూన్పై టాయిలెట్ కట్టేందుకు బెస్ట్ ఐడియా ఇస్తే..
‘గూగుల్ పే’లో కొత్త ఫీచర్.. అప్పులు ఇచ్చేందుకు సిద్ధం..