పాక్లో ఘోర రైలు ప్రమాదం.. 14 మంది మృతి
పాకిస్థాన్లో గురువారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాద ఘటనలో 14 మంది ప్రయాణికులు మృతి చెందారు. గురువారం ఉదయం సాధిఖాబాద్ నగర సమపీంలో వల్హర్ గ్రామం వద్ద వేగంగా వస్తున్న అక్బర్ ఎక్స్ప్రెస్ గూడ్సురైలును ఢీకొంది. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 80 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి […]
పాకిస్థాన్లో గురువారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాద ఘటనలో 14 మంది ప్రయాణికులు మృతి చెందారు. గురువారం ఉదయం సాధిఖాబాద్ నగర సమపీంలో వల్హర్ గ్రామం వద్ద వేగంగా వస్తున్న అక్బర్ ఎక్స్ప్రెస్ గూడ్సురైలును ఢీకొంది. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 80 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఒకదానిపై ఒకటి చిక్కుకుపోయిన రైలు బోగీలను హైడ్రాలిక్ కట్టర్ల సాయంతో తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు.