మహిళల టీ20 ఛాలెంజర్కు వేదికవుతున్న యూఏఈ
మహిళల క్రికెట్కు మరింత ఆదరణ కల్పించేందుకు టీ20 ఛాలెంజర్ టోర్నీకి బీసీసీఐ రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. సూపర్నోవాస్, ట్రయల్బ్లేజర్స్, వెలాసిటీ జట్లు రౌండ్ రాబిన్ లీగ్లో తలపడనున్నాయి.
Womens T20 Challenge : యూఏఈ.. మరో ఐపీఎల్కు వేదికగా మారబోతోంది. క్రికెట్ ప్రియులకు మరింత మజాను అందించేందుకు ఎడారి దేశాలు రెడీ అవుతున్నాయి. ఐపీఎల్-13తోపాటు ఉమెన్స్ టీ20 జరగబోతోంది.
మహిళల క్రికెట్కు మరింత ఆదరణ కల్పించేందుకు టీ20 ఛాలెంజర్ టోర్నీకి బీసీసీఐ రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. సూపర్నోవాస్, ట్రయల్బ్లేజర్స్, వెలాసిటీ జట్లు రౌండ్ రాబిన్ లీగ్లో తలపడనున్నాయి.
ఈ నేపథ్యంలోనే కోవిడ్–19 పరీక్షల అనంతరం గురువారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయల్దేరి వెళ్లారు. వారం రోజుల క్వారంటైన్ అనంతరం మహిళా క్రికెటర్లు బయో బబుల్లోకి అడుగుపెడతారు.
వెటరన్ ప్లేయర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, హర్మన్ప్రీత్ సింగ్, స్మృతి మందాన తదితరులు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. ఇందు కోసం వారు ఇప్పటికే యూఏఈకి ప్రత్యేక విమానంలో బయలు దేరారు.
షెడ్యూల్ ప్రకారం మూడు జట్లతో జరిగే నాలుగు మ్యాచ్ల మహిళల టీ20 ఛాలెంజర్ ట్రోఫీ షార్జా వేదికగా నవంబర్ 4 నుంచి 9 వరకు జరుగనుంది. పురుషుల ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే మహిళల కోసం యూఏఈలో మినీ సీజన్ను నిర్వహించనున్నారు. ఈ మ్యాచులు మంచి ఆదరణ లభిస్తుందని బీసీసీఐ భావిస్తోంది. దీంతో మహిళల క్రికెట్ను ప్రోత్సహించాలని అనుకుంటోంది. ఇది సక్సెస్ అయితే వచ్చే ఏడాది నుంచి మన దేశంలో రంగుల ఆట ఆనందాన్ని పంచనుంది.
Let’s hear it for our girls! ?✨
Hello UAE ??!
The #Supernovas, #Trailblazers, #Velocity have arrived. ??
CANNOT WAIT for #WomensT20Challenge pic.twitter.com/9imeu1EuUL
— IndianPremierLeague (@IPL) October 22, 2020