పాశవికం : మైనర్పై సామూహిక అత్యాచారం, ఆపై సెప్టిక్ ట్యాంకులో
బెంగాల్లోని జల్పాయ్గుడిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి తెగబడ్డాయి మానవమృగాలు.
బెంగాల్లోని జల్పాయ్గుడిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి తెగబడ్డాయి మానవమృగాలు. పదహారేళ్ల బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అత్యంత కర్కశంగా చంపేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని ఓ ఇంటిలోని సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వీరికి 8 రోజుల పోలీసు కస్టడీని విధించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే రాజ్గంజ్కు చెందిన మైనర్ బాలిక.. ఆగస్టు 10 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అనుమానితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి తమదైన స్టైల్లో విచారించగా ఆగస్టు 15న లైంగిక దాడి చేసి చంపేసినట్లు అంగీకరించారు. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ మానవమృగాలకు సభ్య సమాజంలో బ్రతికే అర్హత లేదని, వెంటనే వారిని ఉరి తీయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
Also Read :