కన్నీరు పెట్టుకున్న కిమ్‌ !! నియంతను ఏడిపించిన వారు ఎవరు ??

|

Dec 08, 2023 | 7:19 PM

ఆధునిక ప్రపంచ నియంతగా పేరు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు. ఆ దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోవడటమే ఇందుకు కారణం. ఇటీవల దేశ రాజధాని ప్యాంగాంగ్‌లో తల్లుల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ కన్నీరు కార్చారు. ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికితోడు 1990లో తీవ్ర కరువు ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది.

ఆధునిక ప్రపంచ నియంతగా పేరు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు. ఆ దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోవడటమే ఇందుకు కారణం. ఇటీవల దేశ రాజధాని ప్యాంగాంగ్‌లో తల్లుల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ కన్నీరు కార్చారు. ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికితోడు 1990లో తీవ్ర కరువు ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాభా రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. ఉత్తరకొరియాలో జననాల సంఖ్య భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఉత్తర కొరియాలో 2023లో జననాల రేటు 1.8 ఉంది. ఉత్తర కొరియా జనాభా 2034 నుంచి గణనీయంగా తగ్గిపోతోందని హ్యుందాయ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. 2070 నాటికి జనాభా 23.7 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డమ్మీ బాంబు అని భావించిన దంపతులకు షాక్‌ !!

తెలుగు సినిమా విలన్‌ అరెస్ట్‌ !! పొలం సరిహద్దులో చెట్లు నరికే విషయంలో వివాదం

అవి కృత్రిమ నవ్వులు !! బందీలకు మత్తుమందు ఇచ్చిన హమాస్‌

ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న పాక్‌ అమ్మాయి భారత్‌ అబ్బాయి !! కొవిడ్‌ కష్టాలు దాటి ఒక్కటవుతున్న వేళ

బైజూస్‌లో జీతాల చెల్లింపునకు ఆయన ఇల్లు తాకట్టు

 

Follow us on