ఆ కార్లను తుక్కుగా అమ్మేస్తున్నారు

Updated on: Nov 02, 2025 | 6:44 PM

నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్-జీ చేసిన ఆందోళనల్లో నిప్పంటుకున్న కార్లను ఇప్పుడు ప్రభుత్వం తుక్కు కింద జమకట్టి కిలోల లెక్కన అమ్మేస్తోంది. రాజకీయనాయకుల ఇళ్లు, రోడ్లపై పార్క్ చేసిన వాహనాలకు అప్పట్లో యువత నిప్పంటించారు. దెబ్బతిన్న వాహనాలను ఇప్పుడు తుక్కు కింద అమ్మడం తప్పితే.. ఎలాంటి ఉపయోగం ఉండదని కేబినెట్‌ నిర్ణయించింది.

వాహనాల నుంచి ఇనుమును వేరు చేస్తున్నారు. వేలం పాటలో ఓ స్క్రాప్ డీలర్‌ కిలోకు రూ.45 చొప్పున చెల్లించి, కార్ల తుక్కును కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. ఇంజన్లు బాగానే ఉన్న వాహనాలను వేలం వేయాలని భావిస్తున్నారు. గతంలో ఓ తుక్కు రేసింగ్‌ కారుకు వేలంలో అత్యధికంగా 15 కోట్ల రూపాయల ధర పలికింది. రేసింగ్‌ డ్రైవర్‌ ఫ్రాంకో కోర్టెస్‌ 1954లో ఆ ఫెరారి కారును కొనుగోలు చేశారు. 1960లలో ఓ కారు రేసులో ఆ కారు ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. 2023లో సోత్‌బీ సంస్థ ఆ కారును వేలం వేయగా ఏకంగా రూ.15 కోట్లు పలికింది. కారును బాగుచేసి, మళ్లీ రేసింగ్‌ ట్రాక్‌పై తీసుకొస్తానని దాన్ని కొనుక్కున్న వ్యక్తి చెప్పాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పగలు టెకీలు.. రాత్రయితే క్యాబ్‌ డ్రైవర్లు .. ఏంటీ నయా ట్రెండ్

చెత్తబుట్టలో కనిపించిన కోట్లు.. అంతలోనే

జియో యూజర్లకు గూగుల్ బంపరాఫర్..

ఆహా..! ఆ గదిలో అడుగుపెడితే.. అనంత విశ్వంలో తేలియాడుతారు!

వేగంగా దూసుకెళ్తున్న రైలు.. సడెన్‌గా ఆపేసిన లోకో పైలట్‌.. ఎందుకంటే ??