రైలులో బీభత్సం.. ప్రయాణికులపై కత్తితో దుండగుల దాడి
ఇంగ్లాండ్ లో దారుణం జరిగింది. శనివారం అర్ధరాత్రి సమయంలో లోకల్ ట్రైన్ లో ఓ దుండగుడు కత్తితో ప్రయాణికులపై దాడి చేశాడు. దీంతో పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇంగ్లాండ్ లో దారుణం జరిగింది. శనివారం అర్ధరాత్రి సమయంలో లోకల్ ట్రైన్ లో ఓ దుండగుడు కత్తితో ప్రయాణికులపై దాడి చేశాడు. దీంతో పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శనివారం అర్ధరాత్రి కేంబ్రిడ్జి యూనివర్సిటీ సమీపంలోని హంటింగ్ డన్ రైల్వే స్టేషన్ నుంచి లండన్కు రైలు బయలుదేరింది. ఈ క్రమంలో ఓ దుండగుడు ప్రయాణికులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. కొందరు ప్రాణభయంతో టాయిలెట్లలో దాక్కున్నారు. కత్తిపోట్ల కారణంగా ప్రయాణికుల రక్తంతో రైలు బోగీ తడిసిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పొడవాటి కత్తితో దుండగుడిని చూశామని, కత్తితో విచక్షణారహితంగా ప్రయాణికులపై దాడి చేశాడని పలువురు ప్రయాణికులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే హంటింగ్ డన్ స్టేషన్ చేరుకున్న పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కత్తిపోట్లకు గురైన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు కూడా కత్తిపోట్లను అత్యంత భయంకరమైన దాడిగా ప్రకటించారు. ఈ దాడి వెనుక ఉగ్రకుట్ర కోణం ఉందా అనే దిశగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, రైలులో కత్తిపోట్ల ఘటనపై ఇంగ్లాండ్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ స్పందించారు. ఈ దాడి అత్యంత విచారకరమని, బాధితులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. వేగంగా స్పందించి బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న ఎమర్జెన్సీ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30 వేల అడుగుల ఎత్తులో విమానం ..ప్రయాణికుడికి గుండెపోటు.. ఏం జరిగిందంటే
Telangana: సిరిసిల్ల జిల్లా కుర్రాడికి, ఫ్రాన్స్ అమ్మాయికి పెళ్లి
Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అలర్ట్
