AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు అలర్ట్‌

Hyderabad: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు అలర్ట్‌

Phani CH
|

Updated on: Nov 05, 2025 | 4:46 PM

Share

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. నవంబరు 3వ తేదీ నుంచి మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినళ్లలో, అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.

ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అధికంగా ఉండటం వలన ఉద్యోగులు, విద్యార్థులు మరియు నగరవాసులు మెట్రో రైలు ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రయాణికులందరికీ అనుకూలంగా ఉండేలా ఎల్ అండ్ టీ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. నగరంలో నిత్యం వేలాదిమంది మెట్రో రైల్లో ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా ఉద్యోగులు ట్రాఫిక్‌ సమస్యతో సమయానికి ఆఫీసులకు చేరుకోడానికి మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో ఎక్కువమంది మెట్రో ప్రయాణానికే ప్రాముఖ్యతనిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కడుపు నింపని పురస్కారాలు నాకెందుకు.. ఓ రచయిత ఆవేదన

Aliens: భూమిపై ఉన్న అణు స్థావరాలపై ఏలియన్స్‌ నిఘా

విరాట్‌ కోహ్లీ రెస్టారెంట్.. ప్లేట్ బిర్యానీ రేటెంతో తెలిస్తే షాకే

టీ కోసం ట్రైన్ దిగిన ప్రయాణికుడు.. పాపం.. అంతలోనే

ట్రక్కు నిండా కరెన్సీ నోట్లు.. ఒక్కసారిగా గాల్లోకి ఎగరేశాడు