Keshav Rao: రైతుబంధు నిధులు నిలిపివేతపై ఈసీని కలిసిన కేశవ రావు

Updated on: Nov 27, 2023 | 1:58 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ రైతు బంధును నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ని ఎంపీ కే. కేశవరావు వెళ్లి కలిశారు. రైతుబంధుకు అనుమతి ఉపసంహరించుకోవడంపై వినతిపత్రం అందించారు.  కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీకి వివరణ ఇచ్చారు కేకే. 2రోజుల క్రితం ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం మనకు తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ రైతు బంధును నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ని ఎంపీ కే. కేశవరావు వెళ్లి కలిశారు. రైతుబంధుకు అనుమతి ఉపసంహరించుకోవడంపై వినతిపత్రం అందించారు.  కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీకి వివరణ ఇచ్చారు కేకే. 2రోజుల క్రితం ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం మనకు తెలిసిందే. మంత్రి హరీష్‌రావు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఈసీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశంతో రేపు విడుదల అవ్వాల్సిన రైతుబంధు నిధులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇలాంటి తరుణంలో కేకే ఈసీని కలవడం కాస్త ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 27, 2023 01:56 PM
Loading...
Unable to load recommendations.
Follow Us