ప్రపంచంలోనే అతి పెద్ద విమానం శంషాబాద్లో ల్యాండింగ్
ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానం హైదరాబాద్ శంషాబాద్లో ప్రత్యక్షమైంది. శుక్రవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే పై విజయవంతంగా ల్యాండింగ్ అయింది. దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్న ఈ భారీ విమానాన్ని చూడటానికి విమానాశ్రయం వద్దకు పెద్దసంఖ్యలో జనాలు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ సరకు రవాణాకు ఉపయోగించే ఈ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ల్యాండ్ కావడం ఒక గర్వకారణమని GMR సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఆంటోనోవ్ An-124 రుస్లాన్ అనే ఈ విమానం బరువు సుమారు 1,81,000 కిలోలు. ఇందులో శక్తివంతమైన నాలుగు టర్బోఫాన్ ఇంజిన్లు ఉంటాయి. వీటిని ప్రధానంగా సైనిక సామగ్రి, భారీకార్గో రవాణా, మానవతా సహాయ కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. ఈ విమానం ఉక్రెయిన్లో తయారైంది. ఈ విమానం సైనిక అవసరాల నుండి విపత్తుల సహాయ కార్యక్రమాల వరకు ప్రపంచంలోని దూర ప్రాంతాలకు భారీసరకును వేగంగా రవాణా చేయగలదు. అంతర్జాతీయ రవాణా రంగంలో ఈ విమానానికి చాలా డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై ల్యాండింగ్ సందర్భంగా విమానయాన ప్రియులు, అధికారులు, ప్రయాణికులు ఈ భారీ విమానాన్ని దగ్గరగా చూసేందుకు ఆసక్తి చూపారు. ఆకాశాన్ని చీల్చుకుంటూ దిగిన ఈ భారీ విహంగాన్ని చూడటమే ఒక ప్రత్యేక అనుభవం. విమానాశ్రయం సాంకేతిక సామర్థ్యాలను నిరూపిస్తూ ఈ ల్యాండింగ్ ఘట్టం చారిత్రాత్మకంగా నిలిచిందని జీఎంఆర్ ప్రతినిధులు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉరివేసుకొని ప్రాణం తీసుకోబోయిన మహిళ.. కట్ చేస్తే..
విద్యార్ధులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
సల్మాన్తో దిల్ రాజు బిగ్ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరో తెలుసా
