AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎద్దు స్థానంలో పొలం దున్నిన మహిళ.. ఆ తర్వాత!

ఎద్దు స్థానంలో పొలం దున్నిన మహిళ.. ఆ తర్వాత!

Phani CH
|

Updated on: Jun 15, 2026 | 8:31 PM

Share

మహారాష్ట్రలోని ఒక పేద రైతు కుటుంబం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోంది. పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందడంతో, ప్రత్యామ్నాయం లేక ఒక మహిళ తానే ఎద్దు స్థానంలో కాడి మోసి పొలం దున్నిన హృదయ విదారక ఘటన లాతూర్ జిల్లా దేవని తాలూకా బొంబాలి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కౌలు రైతు కాశీనాథ్ గైక్వాడ్‌ కొన్ని నెలల క్రితం వారు ఒక జత ఎద్దులను కొనుగోలు చేసేందుకు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టారు.

మహారాష్ట్రలోని ఒక పేద రైతు కుటుంబం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోంది. పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందడంతో, ప్రత్యామ్నాయం లేక ఒక మహిళ తానే ఎద్దు స్థానంలో కాడి మోసి పొలం దున్నిన హృదయ విదారక ఘటన లాతూర్ జిల్లా దేవని తాలూకా బొంబాలి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కౌలు రైతు కాశీనాథ్ గైక్వాడ్‌ కొన్ని నెలల క్రితం వారు ఒక జత ఎద్దులను కొనుగోలు చేసేందుకు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే ఇటీవల తుపాను సమయంలో పిడుగు పడి ఒక ఎద్దు చనిపోవడంతో కుటుంబం షాక్ కు గురైంది. తాజాగా, ఖరీఫ్ సాగు సమయం దగ్గర పడటం, కొత్త ఎద్దును కొనే స్తోమత లేకపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. దీంతో కాశీనాథ్ భార్య హౌసాబాయి గైక్వాడ్ తానే ఎద్దు స్థానంలో నిలబడి, భర్తతో కలిసి కాడి మోస్తూ 8 ఎకరాల పొలాన్ని దున్నడం ప్రారంభించింది. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో విపక్ష నేతలతో పాటు ప్రజల నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గైక్వాడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో లాతూర్ కలెక్టర్ భరత్ నేతృత్వంలో అధికారులు బుధవారం ఆ గ్రామాన్ని సందర్శించి, రైతు కుటుంబానికి కొత్త ఎద్దును అందజేశారు. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.32,000 నష్టపరిహారాన్ని వారి ఖాతాలో జమ చేశారు. ప్రభుత్వ సాయంతో హౌసాబాయి ఊపిరి పీల్చుకుంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. పరిహార ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వేగంగా స్పందించడం, వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవడం పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి. సంక్షోభ సమయంలో ఇబ్బందులు పడుతున్న రైతు కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వ సున్నిత వైఖరి, తక్షణ చర్యలను లాతూర్ ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బర్త్ డే రోజున కేక్ కొంటున్నారా.. అయ్యబాబోయ్‌..ఇది చూస్తే..

Follow Us