US dollars: అప్పడాల ప్యాకెట్స్లో యూఎస్ డాలర్లు.. ఎందుకో తెలుస్తే షాకే.. డాలర్లు తో పాటు ఇంకా..
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భారత దేశం నుంచి బ్యాంకాక్ కు వెళ్తున్న ఓ వ్యక్తి కరకరలాడే పాపడ్ ప్యాకెట్ పొరలలో యుఎస్ డాలర్లను..
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భారత దేశం నుంచి బ్యాంకాక్ కు వెళ్తున్న ఓ వ్యక్తి కరకరలాడే పాపడ్ ప్యాకెట్ పొరలలో యుఎస్ డాలర్లను పెట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఈ విషయాన్ని ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సిఐఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. వాస్తవానికి, ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-III వద్ద భద్రతా తనిఖీల్లో భాగంగా ప్రయాణీకులను ఉదయం 5 గంటలకు ఆపారు. నిందితుడు రిషికేశ్ వద్ద తనిఖీ చేయగా పాపడ్ ప్యాకెట్ మధ్యలో దాచిన ఈ కరెన్సీ బయటపడింది.ఎయిర్ పోర్ట్ సిబ్బంది అనుమానంతో.. నిందితుడు రిషికేష్ లగేజీని తనిఖీ చేయడం కోసం చెకింగ్ పాయింట్కు తీసుకెళ్లినట్లు సిఐఎస్ఎఫ్ అధికారి తెలిపారు. అతని లగేజీని ఎక్స్రే యంత్రం ద్వారా తనిఖీ చేయగా, లగేజీలో కొంత విదేశీ కరెన్సీ దాచిన అనుమానాస్పద ఫోటో కనిపించింది. అయితే ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారులు, కస్టమ్స్ శాఖ అధికారులకు చెప్పారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ప్రయాణికుడి నుండి మొత్తం 19,900 US డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ కరెన్సీలో వీటి విలువ దాదాపు 15 లక్షల 50 వేల రూపాయలు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

