Viral Video: హుండీలో మూటగా కనిపించిన పవిత్ర వస్త్రం.. ఓపెన్ చేయగా..
ఈ ఆలయానికి ఏడాదికి ఒకసారి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆ సమయంలో కానుకలు వెల్లువలా వస్తాయి. అయితే తొలిసారిగా గుర్తుతెలియని దాత విరాళాల పెట్టెలో లక్షల రూపాయల విలువైన బంగారాన్ని వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
గుజరాత్లోని అంబాజీ మందిరానికి గుర్తు తెలియని భక్తుడు ఒక కేజీ బంగారాన్ని కానుకగా ఇచ్చాడు. పవిత్ర వస్త్రంలో చుట్టి.. రహస్యంగా కేజీ బంగారాన్ని హుండీలో వేశాడు. ఆలయ సిబ్బంది హుండీ ఓపెన్ చేయగా.. 10 బంగారు బిస్కెట్లు లభించాయి. ఒక్కో బిస్కెట్ 100 గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రహస్యంగా అందజేసిన ఈ బంగారం విలువ దాదాపు రూ. 75 లక్షలు ఉంటుంది. మందిర్లోని వివిధ భాగాలకు బంగారు పూత వేయడానికి అంబాజీ ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా బంగారాన్ని విరాళంగా సేకరిస్తోంది. శిఖర భాగానికి ఇప్పటికే బంగారం పూత వేశారు. బనస్కాంత జిల్లాలోని అంబాజీ ధామ్కు చాలామంది తీర్థయాత్రగా వెళ్తారు. ఏడాదిలో ఒకసారి ఇక్కడ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆ సమయంలోనే వెల్లువగా కానుకలు కూడా వస్తాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

