భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో
తురుకపాలెం నుండి మొత్తం ఆరు కేసులు అంటే తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆరు కేసులను కూడా గుంటూరు జిజిహెచ్ కి తరలించారు. గుంటూరు జిజిహెచ్ లో వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. అంటే ప్రాధమికంగా మెలియోడెసిస్ కేసులుగా అనుమానించి వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. కానీ ఒకరికి మాత్రం పాజిటివ్ వచ్చింది. మరొక ముగ్గురికైతే ఇప్పటివరకు ఆ టెస్ట్ లో మెలియోడెసిస్ ఉన్నట్లుగా బయటపడలేదు. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు మాత్రం ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు.
గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక ప్రత్యేకంగా వార్డ్ పెట్టాం. ఇక్కడ ఆరుగురు పేషెంట్లు ఉన్నారు. వాళ్లలో పన్నెండేళ్ళ లోపు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి కల్చర్ చేశాము నెగిటివ్ వచ్చింది. సిటి స్కాన్ చేశాం నెగిటివ్ వచ్చింది. అయితే వాళ్ళకి లక్షణాలు మాత్రం మెలియోడెసిస్ లక్షణాలు ఉన్నాయి. తురుకపాలెం నుంచే వాళ్లు వచ్చారు. సో వాళ్లను అడ్మిట్ చేశాం. ఎందుకైనా మంచిది ఎందుకంటే మనకి కొంచెం ప్రాణాంతకంగా ఉంది కాబట్టి మనం ముందే జాగ్రత్తలు తీసుకుందాం. చిన్న పిల్లలు మొదట్లో చాలా సిక్ గా ఉన్నారు. పిల్లలిద్దరు ఇప్పుడు బాగుండటంతో వారిని డిశ్చార్జ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కానీ వారికి అవే లక్షణాలు ఉన్నాయి కాబట్టి అదే ట్రీట్మెంట్ ఇచ్చాము. బాగా కోలుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
