టీటీడీ తయారు చేసిన అగరుబత్తులకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది..ఆలయాల్లోని దేవతలకు వినియోగించిన పుష్పాలతో తయారు చేసిన పరిమళభరతి అగరబత్తుల విక్రయం జోరుగా సాగుతోంది…తిరుమలలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో అగరబత్తులు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. టీటీడీకి వచ్చిన ఈ కొత్త ఆలోచనకు భక్తులందరూ కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ ఆలయాల్లోని దేవతల పుష్పాలతో తయారైన ఈ అగరబత్తులను తమ బంధు మిత్రులకు బహుమానంగా ఇవ్వడానికి బాక్సులు, బాక్సులుగా కొనుగోలు చేసేస్తున్నారు భక్తులు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..