రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత !! చలికి గజగజా వణుకుతున్న మూగజీవులు
తెలంగాణలో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం గజగజా వణికిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత దారుణంగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమురంభీం జిల్లా సిర్పూరులో రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదవుతుండంతో ఉదయం 10 గంటలు దాటినా జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
తెలంగాణలో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం గజగజా వణికిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత దారుణంగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమురంభీం జిల్లా సిర్పూరులో రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదవుతుండంతో ఉదయం 10 గంటలు దాటినా జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మనుషులే కాదు చలి తీవ్రతకు పశు పక్షాదులుకూడా అష్టకష్టాలు పడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటంతో.. ఈ ప్రాంతంలోని రైతులు పశువులను చలినుండికాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో తమకు బతుకునిస్తున్న పాడిపశువులను చలి బారినుండి రక్షణ కల్పించేందుకు రైతన్నలు ఆవులు, బసవన్నలకు తట్లు , బొంతలు కప్పి చలి నుండి ఉపశమనాన్ని అందిస్తున్నారు. భీంపూర్ మండలం అర్లీ గ్రామంలో పశువులు చలి తీవ్రతను మౌనంగా భరిస్తున్న మూగజీవులకు రక్షణ కల్పించేందుకు రైతులు వాటి పై తట్లు కప్పి చలి నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

