పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి ఏమైందంటే?

Updated on: Mar 18, 2025 | 10:23 AM

ఓ వ్యక్తి పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నాడు. అయితే వాటిని ఇంట్లో ఉంచి.. బయటికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో రెండు పెంపుడు కుక్కలు కనిపించలేదు. కానీ ఇంటి ముందు ఒక లేఖ కనిపించింది. అందులో ఉన్నది చూసి.. ఆ కుక్కల యజమాని షాక్ అయ్యాడు. ఆ పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేశామని.. వాటిని విడిచిపెట్టాలంటే 10 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశాడు.

 దీంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. చివరికి ఏం జరిగిందంటే? స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జ్యురిక్ సమీపంలోని ష్లీరెన్‌కు చెందిన ఓ 59 ఏళ్ల వృద్ధుడు శునకాలను పెంచుకుంటున్నాడు. అతని వద్ద బోలోంకా జాతికి చెందిన రెండు పెంపుడు శునకాలు ఉన్నాయి. ఇటీవల ఆయన తన రెండు పెంపుడు కుక్కలను ఇంట్లోనే వదిలేసి బయటికి వెళ్లాడు. తన పని చూసుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే ఇంట్లో చూసేసరికి తన రెండు శునకాలు కనిపించలేదు. అక్కడ మొత్తం వెతికాడు. తర్వాత బయటికి వచ్చి కూడా గాలించినా కనిపించలేదు.

మరిన్ని వీడియోల కోసం :

ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో

ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్‌ వీడియో

ముసుగులతో వచ్చి..తుపాకీ గురిపెట్టి..వీడియో

బరువు తగ్గాలని అన్నం తినడం మానేసిన యువతి.. చివరకు వీడియో