వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో నలుగురి ప్రాణం తీసిన అనుమానం వీడియో
వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో భార్యపై అనుమానంతో యాదయ్య అనే వ్యక్తి భార్య, చిన్న కూతురు, వదిన హనుమమ్మను కొడవలితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కూతురు అపర్ణ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు గుర్తించారు.
వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లలో జరిగిన దారుణ ఘటనలో భార్యపై అనుమానంతో యాదయ్య అనే వ్యక్తి తన కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. యాదయ్య తన భార్యతో పాటు చిన్న కూతురిని, వదిన హనుమమ్మను కొడవలితో గొంతు కోసి చంపేశాడు. పెద్ద కుమార్తె అపర్ణను కూడా చంపేందుకు ప్రయత్నించగా, ఆమె తృటిలో తప్పించుకుంది. ఈ దాడిలో అపర్ణ తలకు, చేతులకు తీవ్ర గాయాలవడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ముగ్గురిని హత్య చేసిన తర్వాత యాదయ్య ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో భార్యపై అనుమానమే ఈ ఘోరానికి కారణమని గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం :
తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్ చూసి షాక్ వీడియో
మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో
రూ.11 కోట్ల జాక్పాట్ కొట్టాడు..కానీ వీడియో
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్లోనే...!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?

