చిత్తూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న సస్పెండెడ్ ఏఎస్ఐ మహమ్మద్ మృతి చెందారు. ఈ నెల 4న రోడ్ సైడ్ బట్టల దుకాణంలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా మరో కానిస్టేబుల్తో పాటు దొరికిన కేసులో ఏఎస్ఐ అరెస్టయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు దొంగతనం కేసులో ఇరువురిని సస్పెండ్ చేసి, చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న మహమ్మద్కు గుండెపోటు రావడంతో జైలు అధికారులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహమ్మద్ మృతి చెందారు. దొంగల అవతారమెత్తిన పోలీసులు కొద్ది రోజుల క్రితం కలెక్టరేట్ రోడ్ లోని ఒక ఒమిని వ్యాన్ వద్ద ఉంచిన బట్టల్ని దొంగలిస్తూ సీసీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..