అయోధ్య తరహాలోనే మరో రామాలయం.. ఎక్కడో తెలుసా ??
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అలాగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠను చూసేందుకు యావత్ దేశం కోట్ల కన్నులతో ఎదురు చేస్తోంది. ఈ తరుణంలోనే చండీగఢ్ లో అయోధ్య రామాలయం ప్రతి రూపాన్ని ఏర్పాటు చేసి లక్షలాది లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. అంతదూరం వెళ్లలేని భక్తులు ఈ ఆలయానికి చేరుకొని శ్రీరాముని కృపాకటాక్షాలకు పాత్రులు అవుతున్నారు.
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అలాగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠను చూసేందుకు యావత్ దేశం కోట్ల కన్నులతో ఎదురు చేస్తోంది. ఈ తరుణంలోనే చండీగఢ్ లో అయోధ్య రామాలయం ప్రతి రూపాన్ని ఏర్పాటు చేసి లక్షలాది లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. అంతదూరం వెళ్లలేని భక్తులు ఈ ఆలయానికి చేరుకొని శ్రీరాముని కృపాకటాక్షాలకు పాత్రులు అవుతున్నారు. ఈ ఆలయ గోపురం 80 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పుతో నిర్మించారు. శ్రీ రామ్ కృపా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ఆలయ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో కొన్ని కార్యక్రమాలను రూపొందించారు. ప్రస్తుతం దర్శననిమిత్తం వచ్చిన భక్తులకు లడ్డూలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు రోజు మధ్యాహ్నం 3 గంటలకు మొదటి కార్యక్రమం ప్రారంభమవుతుందని సేవా ట్రస్ట్ సభ్యుడు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏటా శ్రీరామ నవమి నాడు బాల రాముడిని ముద్దాడనున్న సూర్యుడు..
చూస్తుండగానే కుప్పకూలిన ఐదంతస్తుల భవనం..
చెత్తకుప్పలో వేలకొద్దీ ఆధార్, పాన్కార్డులు..
రష్మిక ‘డీప్ఫేక్’ కేసు నిందితుడు అరెస్టు !!
షోయబ్ మూడో పెళ్లి !! ఎవరీ సనా ?? అప్పుడు ఆయేషా, ఇప్పుడు సానియా
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

