Viral Video: స్వామి నిత్యానంద శిష్యులకు ఛేదు అననుభవం.. తరిమి కొట్టిన గ్రామస్తులు.. వీడియో

|

Sep 10, 2021 | 9:54 AM

స్వామి నిత్యానంద శిష్యులకు ఛేదు అననుభవం ఎదురైంది. రాశిపురం సమీపంలో ఒక మహిళా శిష్యుడితో కలిసి స్వగ్రామానికి వచ్చిన నిత్యా నంద శిష్యులను గ్రామస్తులు తరిమికొట్టారు.

స్వామి నిత్యానంద శిష్యులకు ఛేదు అననుభవం ఎదురైంది. రాశిపురం సమీపంలో ఒక మహిళా శిష్యుడితో కలిసి స్వగ్రామానికి వచ్చిన నిత్యా నంద శిష్యులను గ్రామస్తులు తరిమికొట్టారు. వీడియో సోషల్‌ మీడియాలో చేరంటంతో జరిగిన ఘటన కలకలం రేపింది. నామక్కల్ జిల్లా రాశిపురం పక్కన మునియప్పం పాలయం ప్రాంతానికి చెందిన వ్యాపారి రామస్వామి భార్య అత్తయిలక్ష్మి.. నిత్యానంద ప్రవచనాల మీద ఆసక్తితో బెంగళూరు ఆశ్రమంలో చేరారు. బెంగళూరు ఆశ్రమంలో 2017 నుండి నిత్యానంద శిష్యురాలుగా మారిపోయారు. అప్పటి నుంచి నిత్యానంద ఆశ్రమంలోనే నివాసం ఉంటున్నారు. కాగా, తన భార్యని నిత్యానంద ఆశ్రమం నుండి విడిపించాలని రామస్వామి నామక్కల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Earthquake: భారీ భూకంపం.. చిగురుటాకుల్లా వణికిన భవనాలు.. వీడియో

Bigg Boss 5: హౌస్‌లో గొడవకు దిగిన లోబో.. సిరి స్ట్రాంగ్ వార్నింగ్… వీడియో

Follow us on