తీర్థంలో నిద్ర మాత్రలు కలిపి అమ్మాయికి ఇచ్చి పూజారి.. చివరికి ఏం జరిగిందంటే ??

|

May 20, 2024 | 6:24 PM

ఆలయంలో పూజారులంటే భగవంతునికీ, భక్తునికీ మధ్య అనుసంధాన కర్త. ఎన్నో కష్టాలు, కోర్కెలతో దైవానికి చెప్పుకునేందుకు భక్తులు ఆలయానికి వెళ్తుంటారు. పూజారులు భక్తుల కోర్కెలు నెరవేరాలని భగవంతునికి విన్నవించి ఆ దేవునికి మారుగా ఆశీర్వదిస్తారు. అంతటి పవిత్రమైన స్థానానికి కొందరు వారి ప్రవర్తనతో మచ్చ తెస్తున్నారు. తాజాగా ఓ పూజారి ఓ టీవీ యాంకర్‌కు తీర్థంలో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడిగన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

ఆలయంలో పూజారులంటే భగవంతునికీ, భక్తునికీ మధ్య అనుసంధాన కర్త. ఎన్నో కష్టాలు, కోర్కెలతో దైవానికి చెప్పుకునేందుకు భక్తులు ఆలయానికి వెళ్తుంటారు. పూజారులు భక్తుల కోర్కెలు నెరవేరాలని భగవంతునికి విన్నవించి ఆ దేవునికి మారుగా ఆశీర్వదిస్తారు. అంతటి పవిత్రమైన స్థానానికి కొందరు వారి ప్రవర్తనతో మచ్చ తెస్తున్నారు. తాజాగా ఓ పూజారి ఓ టీవీ యాంకర్‌కు తీర్థంలో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడిగన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని ప్రధాన అమ్మన్ ఆలయాల్లోని ఒక ఆలయంలో కార్తీక్ మునిస్వామి పూజారిగా ఉన్నాడు. అత్యాచారానికి గురైన యాంకర్ చెన్నైలోని సాలిగ్రామం ప్రాంతంలో ఉంటుంది. తనపై జరిగిన దారుణంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఆథ్యాత్మిక వ్యక్తినని, తరచుగా ఆలయాలను సందర్శిస్తుంటానని ఫిర్యాదులో ఆమె తన గురించి పేర్కొంది. చెన్నైలోని పర్యాస్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ కాళికంపాల్ ఆలయానికి తరచుగా వెళ్తుంటానని, ఈ క్రమంలో తనకు ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామితో పరిచయం ఏర్పడిందని తెలిపింది. ఈ స్నేహంతో తాను గుడికి వచ్చినప్పుడల్లా కార్తీక్ మునిస్వామి గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం చేయించేవాడని చెప్పింది. ఈ క్రమంలో తమకు స్నేహం పెరిగిందని… ఒకరోజు తాను గుడికి వచ్చినప్పుడు తన బెంజ్ కారులో డ్రాప్ చేస్తానని చెప్పాడని… కారులో ప్రయాణిస్తుండగా తీర్థం ఇచ్చాడని, దీన్ని తాగిన తర్వాత తనకు స్పృహ తప్పిందని ఆమె తెలిపింది. ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. ఇది జరిగిన తర్వాత తనను గుడిలోనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని… ఆ తర్వాత చాలా సార్లు తమ ఇంటికి వచ్చాడని, తాను గర్భవతిని అయ్యానని తెలిపింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడని, ఆ తర్వాత తనను వ్యభిచారం చేయమని బలవంతం చేశాడని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలను అతని ఫోన్ నుంచి పోలీసులు రికవరీ చేశారు. ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన బాధితురాలు చెన్నైకి చెందిన ఓ టీవీ ఛానల్ లో పని చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మృతి చెందిన యువతికి వరుడు కావలెను !! పిచ్చి పరాకాష్టకు చేరితే ఇలాగే ఉంటుంది

26 ఏళ్లుగా వ్యక్తి మిస్సింగ్.. పొరుగింట్లోనే బందీగా

భర్త రూ.5ల కుర్‌ కురే తేలేదని విడాకుల వరకూ వెళ్ళిన దంపతులు

ఆవలింత వచ్చిందని పెద్దగా నోరు తెరిచిందంతే.. దవడ కాస్తా ??

ఒక్క మలుపు కూడా లేకుండా 256 కి.మీ హైవే

Follow us on