29 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్‌.. ఇప్పుడు అతనో మిలియనీర్‌

Updated on: Nov 15, 2022 | 8:14 AM

ఏకంగా 29 ఏళ్లుగా ఓ హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవధిలో నిందితుడు ఓ మిలియనీర్‌గా ఎదగడం గమనార్హం.

ఏకంగా 29 ఏళ్లుగా ఓ హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవధిలో నిందితుడు ఓ మిలియనీర్‌గా ఎదగడం గమనార్హం. దక్షిణ చైనాలో జియాంగ్‌ అనే వ్యక్తి 1993లో.. ఓ వివాదంలో ఎదుటి వ్యక్తిని కత్తితో పొడిచి హతమార్చాడు ఆ తర్వాత పరారయ్యాడు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్న పోలీసులు.. ఎట్టకేలకు 29 ఏళ్ల తర్వాత నిందితుడి ఆచూకీ కనిపెట్టారు. ఈ క్రమంలోనే అతన్ని అరెస్టు చేసేందుకుగానూ.. 1,200 కిలోమీటర్లు ప్రయాణించి హుయిజౌ నగరానికి చేరుకున్నారు. ఇక్కడే నిందితుడు తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. ప్రస్తుతం.. ఈ ప్రాంతం కొవిడ్‌ గుప్పిట్లో ఉంది. పోలీసులు కరోనా కట్టడి సిబ్బందిగా నటిస్తూ.. చివరకు అతన్ని అరెస్టు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్లూట్ గానంతో విద్యార్థి మ్యాజిక్‌.. వందే భారత్‌ రైల్లో..

మొసలిని మింగిన కొండచిలువ.. చివరికి అతి కష్టం మీద.. ??

రహదారిపై ల్యాండ్‌మైన్‌ బ్లాస్ట్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

ఘోర ప్రమాదం.. గాలిలో ఢీకొన్న రెండు విమానాలు !!

మళ్లీ కరోనా ప్రళయం.. ఆ నౌకలో 800 మందికి పాజిటివ్..

 

Published on: Nov 15, 2022 08:14 AM
Loading...
Unable to load recommendations.
Follow Us