మా ఆవిడ నన్ను కొట్టింది.. జపాన్ రాయబారి ట్వీట్.. మోదీ రియాక్షన్‌

|

Jun 17, 2023 | 9:59 AM

జపాన్ రాయబారి హిరోషి సుజుకి, తన భార్యతో కలసి భారత దేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దంపతులు భారత్ లోని వైవిధ్యమైన వంటల రుచులను ఆస్వాదిస్తున్నారు.ప్రపంచంలో ఎక్కడలేని రుచికరమైన ఆహార పదార్ధాలు మన దేశంలో దొరుకుతాయి అని తెలిసిన విషయమే.

జపాన్ రాయబారి హిరోషి సుజుకి, తన భార్యతో కలసి భారత దేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దంపతులు భారత్ లోని వైవిధ్యమైన వంటల రుచులను ఆస్వాదిస్తున్నారు.ప్రపంచంలో ఎక్కడలేని రుచికరమైన ఆహార పదార్ధాలు మన దేశంలో దొరుకుతాయి అని తెలిసిన విషయమే. హిరోషి సుజుకి వారణాసి లో పర్యటించి, అక్కడ దొరికే బనారసి చాట్ రుచి చూశారు. తాలీని కూడా తిన్నారు. తర్వాత ముంబైకి వెళ్లారు. అక్కడ వడా పావ్ రుచి చూశారు. దాన్ని ఎంతో బాగా ఇష్టపడిన ఆయన, అది కాస్త ఘాటుగా ఉన్నట్టు చెప్పారు. ఇక కొల్హాపూరిలో తినగానే హిరోషి సుజుకి కు కళ్లవెంట నీళ్లు తిరిగాయి. కొల్హాపురి వంటలు సహజంగా ఎంతో ఘాటుగా ఉంటాయి. ఈ ఘాటుకు జపాన్ రాయబారి హాస్యంగా స్పందించారు. ఆహారం తింటున్న వీడియోని పోస్ట్ చేస్తూ ‘నా భార్య నన్ను కొట్టింది’ అని క్యాప్షన్ వేశారు, దాని పక్కనే మిరపకాయ ఎమోజీ కూడా జత చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ అంతే హాస్యంగా స్పందించారు. ‘‘ఓటమి గురించి పట్టించుకోని పోటీ ఇది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యయ్యో.. టైమ్ బ్యాడ్ అయితే ఇలాగే ఉంటుంది.. కారు నుంచి సేఫ్ అయినా.. కుక్క వదల్లేదు..

బోటులో ఎగిసిపడ్డ మంటలు.. డాల్ఫిన్స్ కోసం వెళితే ఊహించని ప్రమాదం

సైకిల్‌ పై పడుకొని స్టంట్‌ చేశాడు.. చివరికి ??

అమెరికా రెస్టారెంట్‌లో భారతీయ ఘుమఘుమలు.. ప్రధాని మోదీ పేరుతో స్పెషల్ థాలీ

విడాకుల కోసం భర్తను బెదిరించి.. రూ. 6 కోట్ల భరణం డిమాండ్.. ఆ తర్వాత ??

Follow us on