కాకినాడలో భారీ స్కామ్‌..ఏకంగా కోట్ల విలువ చేసే..

Updated on: Jan 29, 2026 | 7:50 AM

కాకినాడ జిల్లా లో సిగరెట్ట రాకెట్‌ గుట్టు రట్టు చేశారు పోలీసులు. కాకినాడ రూరల్ మండలం తూరంగిలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత, అన్ బ్రాండెడ్ సిగరెట్ల దందా రాకెట్ గుట్టును విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. తూరంగి బైపాస్ రోడ్డు సమీపంలో ఓ ఇంట్లో అక్రమంగా సిగ రెట్ నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, జీఎస్టీ, లీగల్ మెట్రాలజీ, ఇంద్రపాలెం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు... అక్రమ సిగరెట్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు.

విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తాతారావు తెలి పిన వివరాల మేరకు.. కాకినాడలోని సూర్య నారాయణపురానికి చెందిన పచ్చిగోళ్ల అప్పారావు రెండు నెలల కిందట తూరంగి శివారు ప్రాంతంలో ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఇతడు ఒడిసా, బిహార్ లోని పాట్నా నుంచి నిషేధిత, అన్ బ్రాండెడ్ కల్తీ సిగరెట్లను కొనుగోలు చేసి, లారీల్లో తూరంగి తీసుకొచ్చి అక్రమంగా నిల్వ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని పలు పాన్‌ షాపులకు బిల్లులు లేకుండా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో అధికారులు చేసిన దాడుల్లో సుమారు 1.75 కోట్ల విలువ చేసే 311 బాక్సుల్లో ఉన్న 3,73,200 అన్ బ్రాండెడ్ సిగ రెట్ పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అప్పారావును అదుపులోకి తీసుకొని, తదుపరి విచారణ కోసం ఇంద్రపాలెం పోలీసులకు అప్పగించారు. ఒక్కో పెట్టెపై రేటు రూ.40 నుంచి రూ.100 ముద్రించి ఉందని తాతారావు తెలిపారు. ఈ సరుకును నిందితుడికి సరఫరా చేస్తున్న వారి పేర్లు, ఈ రాకెట్లో ఇంకెవ రైనా ఉన్నారా? అనే వివరాలు పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. అప్పారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇంద్రపాలెం పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌

Published on: Jan 29, 2026 07:49 AM