మెదక్ లో చిరుత సంచారం.. భయాందోళనలో రైతులు, పశువుల కాపరులు
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడిపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తూ కలకలం రేపింది. కొండపై సంచరిస్తున్న చిరుతను పశువుల కాపరులు వీడియో తీశారు. ఈ సంఘటనతో గుండ్రెడిపల్లి రైతులు, పశువుల కాపరులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. వన్యమృగాల బారినుంచి తమను రక్షించాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.
మెదక్ జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తూప్రాన్ మండలం గుండ్రెడిపల్లి అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానిక పశువుల కాపరులు గుర్తించారు. కొండపై సంచరిస్తున్న ఈ చిరుత దృశ్యాలను కొందరు పశువుల కాపరులు తమ కెమెరాలలో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం స్థానికంగా వైరల్ అవుతోంది. చిరుతపులి సంచారం నేపథ్యంలో గుండ్రెడిపల్లి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులు, పశువుల కాపరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పశువులకు, పంట పొలాలకు, ప్రాణాలకు హాని జరుగుతుందేమోనని భయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు వన్యప్రాణుల నుంచి తమకు రక్షణ కల్పించాలని అటవీ శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ డివైన్ మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్స్
అరసవల్లిలో అద్భుత దృశ్యం.. మూల విరాట్టును తాకిన సూర్యకిరణాలు
అక్టోబర్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

