రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
జనగామ జిల్లాలో గుడ్ల వ్యాన్ బోల్తా పడి వేలాది గుడ్లు రోడ్డుపై పడిపోయాయి. అధిక ధరల కారణంగా జనం గుడ్ల కోసం ఎగబడగా, పోలీసులు, వ్యాన్ యజమాని వాటిని కాపాడాల్సి వచ్చింది. జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో కొన్ని గుడ్లు పగిలిపోయినా, మిగిలిన వాటిని తీసుకెళ్లేందుకు జనం ప్రయత్నించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జనగామ జిల్లాలో కోడిగుడ్ల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న గుడ్లన్నీ చెల్లచెదురుగా రోడ్డుపై పడ్డాయి. కొన్ని కిందపడి పగిలిపోగా.. మరికొన్ని ట్రేలలో అలానే ఉన్నాయి. అసలే కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగిపోవడంతో.. రోడ్డుపై పడిపోయిన కోడిగుడ్ల కోసం జనం ఎగబడ్డారు. దీంతో ఆ డీసీఎం ఓనర్ తో సహా, పోలీసులు ఆ గుడ్లు ఎవరు ఎత్తుకుపోకుండా కాపలా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదం బుధవారం జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై దేవరుప్పుల మండలం మాన్సింగ్ తండా వద్ద జరిగింది. జనగామ నుంచి సూర్యాపేటకు కోడిగుడ్ల లోడ్ తో వెళ్తోన్న.. డీసీఎం వ్యాన్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కోడి గుడ్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. వేల సంఖ్యలో గుడ్లన్నీ రోడ్డుపై చల్లా చెదురుగా పడిపోవడంతో ఆ మార్గంలో వెళ్తున్న వారంతా గుడ్లను ఎత్తుకుపోయేందుకు పరుగులు పెట్టారు. పక్కనే ఉన్న తండావాసులు గుడ్ల కోసం అక్కడికి చేరుకున్నారు. అందినకాడికి కోడిగుడ్లను ఏరుకుని.. పండుగ చేసుకున్నారు. గుడ్ల కోసం జనం అక్కడికి వస్తుండటం చూసి పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన వెంటనే DCM వ్యాన్ ఓనర్ తో సహా, సిబ్బంది అక్కడికి చేరుకుని వాటిని వేరొక వాహనంలోకి ఎక్కించి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
ప్రైవేటు క్యాబ్ ట్యాక్సీల దోపిడీకి చెక్.. భారత్ టాక్సీ సేవలు షురూ..!
