17 ఏళ్ళ తరువాత పెద్దమ్మ తల్లి దేవర … కళ్ళు చెదిరిపోయేలా చేసిన మహిళలు
అక్కడ ఫ్యాక్షన్ కాదు దైవత్వం కూడా నిండుగా ఉంటుంది.. 17 ఏళ్ల తర్వాత ఆ ప్రాంతంలో పెద్దమ్మ తల్లి దేవర జరుపుతున్నారు... ఆ దేవరకు మహిళలు వినూత్న రీతిలో అందరినీ ఆకట్టుకున్నారు... 1200 కలశాలతో భారీ ఊరేగింపుగా వెళ్ళి పెద్దమ్మతల్లికి కళాశాలలోని నీటితో అభిషేకం చేశారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అక్కడ జరిగే ఫ్యాక్షన్ … అయితే అక్కడ జనాలలో ఫ్యాక్షన్ తో పాటు దైవభక్తి కూడా ఎక్కువే అలాగే ఉంటుంది మరి అక్కడ.. ఆ దైవభక్తిని చాటుకోవడానికి ఈరోజు మహిళలందరూ చేసిన ఆ వినూత్న ప్రయత్నం అందరిని ఆకట్టుకుంది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత జమ్మలమడుగులో పెద్దమ్మ తల్లి దేవర జాతరలు చేశారు. ఆ కార్యక్రమానికి 1200 మంది మహిళలు కలశాలను మోసుకుంటూ గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి ఆలయం నుండి జమ్మలమడుగులోని పురవీధులన్నీ తిరుగుతూ పెద్దమ్మ తల్లి దేవాలయానికి చేరుకుని కళాశాలలోని నీటితో ఆ తల్లికి అభిషేకం చేశారు. ఈరోజు నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఒకటవ తేదీ అమ్మవారికి నైవేద్య కార్యక్రమం ఉంటుంది. అప్పటివరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ జాతరకు రాష్ట్రంలోని నలుమూలలో ఉన్న ఆ ప్రాంత ప్రజలందరూ అక్కడకు చేరుకున్నారు. మహిళలు అందరు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దమ్మతల్లి దేవర జాతరలో పాల్గొనటంతో రోడ్లన్నీ పసుపు మయం అయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం :