Puri Jagannath Temple: పూరి జగన్నాథుడి ఖజానా.. ఫిక్సైన ముహూర్తం జూలై 14.!

Edited By:

Updated on: Jul 15, 2024 | 10:26 AM

ఆ ఖజనాలో కళ్లు జిగేల్ మనే నగలు.. వెల కట్టలేని అపురూపమైన ఆభరణాలు.. వీటితోపాటు మరెన్నో విలువైన నగలు. ఇది ఒడిశా రాష్ట్రంలో కొలువుదీరిన జగన్నాథుడి క్షేత్రం.. పూరీలో ఉన్న రత్న భాండాగారం సంగతి. ఒకటి కాదు.. రెండు కాదు.. 46 ఏళ్లయ్యింది... ఆ గదిలోకి మనుషులు వెళ్లి. అప్పుడెప్పుడో 1978కి ముందు తెరుచుకున్న తలుపులు.. మళ్లీ ఇప్పటివరకు తెరవలేదు. కానీ నిత్యం ఇది వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కారణం.. ఈ ముఖ్యమైన భాండాగారానికి ఉన్న అసలైన తాళం చెవి మిస్సవ్వడం.

ఆ ఖజనాలో కళ్లు జిగేల్ మనే నగలు.. వెల కట్టలేని అపురూపమైన ఆభరణాలు.. వీటితోపాటు మరెన్నో విలువైన నగలు. ఇది ఒడిశా రాష్ట్రంలో కొలువుదీరిన జగన్నాథుడి క్షేత్రం.. పూరీలో ఉన్న రత్న భాండాగారం సంగతి. ఒకటి కాదు.. రెండు కాదు.. 46 ఏళ్లయ్యింది.. ఆ గదిలోకి మనుషులు వెళ్లి. అప్పుడెప్పుడో 1978కి ముందు తెరుచుకున్న తలుపులు.. మళ్లీ ఇప్పటివరకు తెరవలేదు. కానీ నిత్యం ఇది వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కారణం.. ఈ ముఖ్యమైన భాండాగారానికి ఉన్న అసలైన తాళం చెవి మిస్సవ్వడం. చూడ్డానికి, వినడానికి ఇది చిన్న అంశం కనిపించవచ్చు. కానీ ఎన్నికల్లో ప్రభుత్వాలనే మార్చేంత శక్తి దీనికి ఉందని ఈమధ్యే జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఆ ఎన్నికల క్యాంపైన్ లో ఈ తాళం చెవి సంగతి మారుమోగింది. అలాంటి రత్నభాండాగారం తాళం చెవి ఎక్కడుంది? అసలా గదిలో ఏముంది? కేరళలో పద్మనాభస్వామి వారి ఆలయంలో ఉన్నట్టుగా అత్యంత విలువైన సంపద ఉందా? 46 ఏళ్లకు ముందు దానిని లెక్కబెట్టిన వివరాలు ఉన్నాయా? పూరీ జగన్నాథుడికి ఉన్న ఆభరణాల సంపద గురించి తెలియాలంటే.. ముందుగా ఈ రత్న భాండాగారాన్ని తెరవాలి. అందుకే దీనిని జూలై 14న తెరవడానికి రంగం సిద్ధమైంది. తరువాత ఆ గదికి అవసరమైన మరమ్మతులు చేపడతారు. ఆ తరువాత ఆభరణాల లెక్కల వివరాలనూ పొందుపరుస్తారు. దీనిని తెరవడానికి సంబంధించి ఒడిశా సర్కార్ ఇప్పటికే...

Published on: Jul 13, 2024 07:22 PM