ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?

Updated on: Jul 03, 2026 | 2:40 PM

భారత వాతావరణ శాఖ జూలై నెల అంచనాలను విడుదల చేసింది. జూన్‌లో 40% వర్షపాతం లోటు నమోదవ్వగా, జూలైలోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు మందగిస్తున్నాయి. ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, జూలై తొలి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ కొద్దిపాటి ఊరటనిచ్చింది.

దేశంలో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. జూన్‌లో వర్షపాతం 40 శాతం లోటు నమోదు కాగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జూలై నెల అంచనాలతో రైతులను మరింత ఆందోళనకు గురిచేసింది. జూలైలోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని ఐఎండీ తెలిపింది.పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం భారత రుతుపవనాలను తీవ్రంగా మందగింపజేస్తోంది. దీనివల్ల వర్షపు మేఘాలు బలహీనపడి, దారి మళ్లుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయ రంగంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఖరీఫ్ సాగుకు వర్షాలే ఆధారం. పంటల సాగు నిలిచిపోవడంతో ఆహార సంక్షోభం, ద్రవ్యోల్బణం ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో, వ్యవసాయ శాఖ నీటి పొదుపు పద్ధతులు, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ఎంచుకోవాలని సూచించింది. అయితే, జూలై మొదటి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, ఈశాన్య, వాయువ్య, మధ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ కొద్దిపాటి ఆశను రేపింది. తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం :

అంచనాలు పెంచేస్తున్న సెకండాఫ్ మూవీస్‌.. ఫస్టాఫ్‌ గాయాలను మరిపిస్తుందా..?

ఆలియా సినిమాపై ప్రభాస్‌ ట్వీట్‌.. ఆన్‌లైన్‌లో నయా డిస్కషన్‌

జస్ట్ 80 డేస్‌… క్రేజీ న్యూస్‌ రివీల్ చేసిన జక్కన్న

టాక్సిక్ టీజర్‌… మరింత బోల్డ్‌గా లేడీస్‌ గ్యాంగ్‌

నిరాశపరిచిన ఫస్టాఫ్‌… సెకండాఫ్ సంగతేంటి?

Follow Us