ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. అవును ఇకపై ఇద్దరు ఆడిపిల్లలున్న వారు తమ పిల్లలను ప్రైవేటు స్కూల్లో చదివిస్తే వారిలో ఒకరి బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. అవును ఇకపై ఇద్దరు ఆడపిల్లలను ఒకే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే.. వారిలో ఒకరికి పూర్తి ఫీజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అందుకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సైతం పంపింది. ప్రతిపాదన ఆమోదం పొందితే ఈ పథకం వల్ల ప్రాథమిక, ప్రాథమికోన్నత, మాధ్యమిక పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది బాలికలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద కోటి రూపాయల టోకెన్ను అందజేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..