టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వదిలిపెట్టడం లేదు. వీరి మూఢనమ్మకాలకు నిండు ప్రాణాలు బలవుతున్నాయి. అవగాహన లేమితో గుడ్డిగా మూఢనమ్మకాలను అనుకరిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల బాలుడి నరబలి ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బలైన బాలుడు అబ్దుల్ వహీద్గా గుర్తించారు. అమావాస్య వేళ ఆ మహిళ బలి ఇచ్చినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ నాలా సమీపంలో బాలుడి మృతదేహం లభించడంతో సదరు మహిళ ఇంటిపై స్థానికులు దాడికి దిగారు. దీంతో సనత్నగర్లోని అల్లాదున్ కోటి ఏరియాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..