గంగానదిలో అద్భుతం.. నీటిలో తేలుతున్న శిల

|

Aug 28, 2023 | 8:46 PM

బిహార్‌ రాజధాని పాట్నాలో విచిత్ర సంఘటన జరిగింది. గంగానది రాజ్‌ఘాట్‌ వద్ద స్థానికులకు ఓ రాయి దొరికింది. అదే ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ రాయి నదిలో తేలుతూ కనిపించింది. అంతేకాదు ఈ రాయిపై ‘శ్రీరామ్‌’ అని రాసి ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. నదీతీరాన ఉన్న ఓ ఆలయంలో నీటితొట్టిలో ఈ రాయిని ఉంచారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రాయిని దర్శించేందుకు తరలి వస్తున్నారు.

బిహార్‌ రాజధాని పాట్నాలో విచిత్ర సంఘటన జరిగింది. గంగానది రాజ్‌ఘాట్‌ వద్ద స్థానికులకు ఓ రాయి దొరికింది. అదే ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ రాయి నదిలో తేలుతూ కనిపించింది. అంతేకాదు ఈ రాయిపై ‘శ్రీరామ్‌’ అని రాసి ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. నదీతీరాన ఉన్న ఓ ఆలయంలో నీటితొట్టిలో ఈ రాయిని ఉంచారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రాయిని దర్శించేందుకు తరలి వస్తున్నారు. అది రామసేతు రాయిగా భావించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాయి దొరికిన రాజ్‌ఘాట్‌ పేరును రామ్‌ఘాట్‌గా మార్చాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. అది రామసేతులోని రాయేనని, ఈ రాయిపై పరిశోధన జరపాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ.. ఆశ్చర్యంలో జనం

Follow us on