Bullet Train: బుల్లెట్ రైలు పరుగులు ఈ పట్టాలపైనే.. వీడియో ఇదిగో!
భారత్లో త్వరలోనే బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, బుల్లెట్ ట్రైన్ కోసం ప్రత్యేక రకం ట్రాక్ను రైల్వేశాఖ నిర్మిస్తుంది. తొలిసారిగా ట్రాక్కు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఎక్స్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు. దేశంలోనే తొలి బ్యాలస్ట్లెస్ ట్రాక్ విశేషాలను వివరించారు.
భారత్లో త్వరలోనే బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, బుల్లెట్ ట్రైన్ కోసం ప్రత్యేక రకం ట్రాక్ను రైల్వేశాఖ నిర్మిస్తుంది. తొలిసారిగా ట్రాక్కు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఎక్స్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు. దేశంలోనే తొలి బ్యాలస్ట్లెస్ ట్రాక్ విశేషాలను వివరించారు. గుజరాత్-ముంబై మధ్య నిర్మిస్తున్న ట్రాక్ గురించి సవివరంగా సమాచారం అందించారు. దాంతో పాటు బుల్లెట్ రైలు దృశ్యాలను యానిమేషన్ రూపంలో అందించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద నిర్మిస్తున్న ఈ ట్రాక్లు బ్యాలస్ట్లెస్గా ఉన్నాయని.. కంకర, కాంక్రీట్ అవసరం లేని ట్రాక్లని అశ్విని వైష్ణవ్ చెప్పారు. హై-స్పీడ్ రైళ్ల బరువును భరించేందుకు వీలుగా ప్రత్యేకంగా ట్రాక్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ట్రాక్లో వేగం గంటకు 320 కిమీ వరకు ఉంటుందని అన్నారు.
153 కిలోమీటర్ల మేర వయాడక్ట్ పనులు పూర్తయ్యాయని.. దీంతోపాటు 295.5 కిలోమీటర్ల పీర్ వర్క్ కూడా పూర్తయ్యిందని వివరించారు. స్పెషల్ జేస్లాబ్ బాలస్ట్లెస్ ట్రాక్ సిస్టమ్ ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్రాక్ సిస్టమ్ లో ప్రధానంగా నాలుగు భాగాలుంటాయని ప్రీ-కాస్ట్ స్లాబ్, పట్టాలతో కలిసి ట్రాక్ ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని రెండు చోట్ల ప్రీ-కాస్ట్ ఆర్సీ ట్రాక్ స్లాబ్లను తయారు చేస్తున్నట్లు వీడియోలో తెలిపారు. గుజరాత్లోని ఆనంద్, కిమ్లో తయారవుతున్నాయని.. సుమారు 35వేల మెట్రిక్ టన్నుల పట్టాలు అందుబాటులోకి వచ్చాయని.. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వీడియోలో వివరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.