ఆ ఊరికి దెయ్యం భయం… ఖాళీ చేసి వెళ్లిపోయిన జనం

|

Nov 03, 2023 | 8:54 PM

దెయ్యాలు.. నిజంగానే ఉన్నాయా..? ఆ విషయంలో ఎవరికి క్లారిటీ వారికున్నా...కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం వరుసగా మరణాలు సంభవిస్తుండటంతో ఆ ఊరికి దెయ్యం పట్టిందనీ, అందుకే చిన్నా, పెద్దా అందరూ చనిపోతున్నారనే భయంతో ఏకంగా ఊరి మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. రాత్రయితే చాలు ఇళ్ల ముందు బండరాళ్లు పడుతున్నాయని, ఏక్షణంలో ఎవరిపైన దెయ్యం ఎటాక్‌ చేస్తుందోనని ఉన్న ఊరుని, కట్టుకున్న ఇళ్లను వదిలి తలో దిక్కుకూ వెళ్లిపోయారు.

దెయ్యాలు.. నిజంగానే ఉన్నాయా..? ఆ విషయంలో ఎవరికి క్లారిటీ వారికున్నా…కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం వరుసగా మరణాలు సంభవిస్తుండటంతో ఆ ఊరికి దెయ్యం పట్టిందనీ, అందుకే చిన్నా, పెద్దా అందరూ చనిపోతున్నారనే భయంతో ఏకంగా ఊరి మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. రాత్రయితే చాలు ఇళ్ల ముందు బండరాళ్లు పడుతున్నాయని, ఏక్షణంలో ఎవరిపైన దెయ్యం ఎటాక్‌ చేస్తుందోనని ఉన్న ఊరుని, కట్టుకున్న ఇళ్లను వదిలి తలో దిక్కుకూ వెళ్లిపోయారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం చిన్నగుట్ట తండాలో జరిగింది. చిన్నగుట్ట తండా..ప‌చ్చని ప‌కృతి అందాలతో ప్రశాంత‌త‌కు మారు పేరుగా ఉండేది. ఈ గ్రామంలో 50 గిరిజన కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. అలాంటి గ్రామానికి ఉన్నట్టుండి దెయ్యం భయం పట్టుకుంది. రాత్రయితే చాలు ఇళ్ల ముందు పెద్ద పెద్ద రాళ్లు పడటం మొదలైందట. ఒక్కోసారి ఆ రాళ్లు తగిలి చాలామందికి గాయాలు కూడా అయ్యాయని స్థానికులు తెలిపారు. ఆ రాళ్లు ఎక్కడినుంచి వస్తున్నాయో తెలియక అయోమయానికి గురయిన గిరిజనులు అదంతా దెయ్యం పనే అని భావించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే పియానో వాయించాడు

Vijay Thalapathy: మీ కాలికింద చెప్పునవుతా.. సూపర్ స్టార్ పొలిటికల్ కామెంట్స్

Sushmita Sen: సుస్మితాసేన్‌కు గుండెపోటు.. కారణం ఇదే..

CM KCR: తుది ఘట్టానికి కేసీఆర్‌ రాజశ్యామల యాగం !!

నామినేషన్లకు ముహూర్త బలం.. ఆ నాలుగు రోజులే !!

 

 

Follow us on