ఉక్రెయిన్పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం కారణంగా లక్షల మంది పౌరులు యుద్ధ క్షేత్రాన్ని వీడిపోయిన సంగతి తెలిసిందే. యుద్ధం కారణంగా అక్కడ నుంచి పొరుగు దేశానికి వెళ్లిపోయిన ఓ ఆంధ్రా డాక్టర్.. తన పెంపుడు పులులను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన డాక్టర్ గిరి కుమార్ పాటిల్ ఉక్రెయిన్లోని సెవెరోదొనెట్స్క్లో ఉన్న ఓ ఆస్పత్రిలో పనిచేసేవారు. కీవ్లోని జంతు ప్రదర్శనశాల నుంచి ‘యశా’ అనే జాగ్వర్ హైబ్రిడ్ చిరుతపులితో పాటు ‘సబ్రినా’ అనే ఫాంథర్ నల్లటి చిరుతను గత రెండేళ్లుగా పెంచుకుంటున్నారు. అంతరించిపోతున్న పులులు జాతులను కాపాడే ప్రయత్నమని చెప్పే ఆ వైద్యుడిని జాగ్వర్ కుమార్గా పిలిచేవారు. అయితే, రష్యా దాడుల్లో పాటిల్ పనిచేస్తున్న ఆస్పత్రి నాశనం కావడంతోపాటు.. ఆ ప్రాంతాన్ని పుతిన్ సేనలు ఆక్రమించుకున్నాయి. పాటిల్కు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. పెంపుడు పులుల పోషణ కష్టతరమైంది. దీంతో వాటిని లుహాన్స్క్లోని స్థానిక రైతు వద్ద వదిలిపెట్టి పోలాండ్కు వెళ్లిపోయాడు.. ఇంకా మరింత సమాచారం కోసం ఈ వీడియో చూసేయండి..