డీమ్యాట్ ఖాతాలో రూ. 2,817 కోట్ల సంపద.. కాసేపటికే అంకెలన్నీ మాయమై
మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి తలరాత రాత్రికి రాత్రే మారిపోయింది. నోటరీగా పనిచేస్తూనే..ప్రైవేటు స్కూలు నడుపుతున్న వినోద్ డోంగ్లే డీమ్యాట్ ఖాతాలోని ఓ కంపెనీ షేర్ల విలువ కోట్లకు పెరిగిపోయింది. మొత్తంగా వెయ్యికి పైగా షేర్లు ఉండడంతో ఆయన సంపద ఏకంగా రూ.2,817 కోట్లకు చేరినట్లు చూపించింది. దీంతో తన తలరాత మారిపోయిందని, ప్రపంచంలోని లాటరీలన్నీ ఒకేసారి గెల్చానని భావించినట్లు డోంగ్లే చెప్పారు.
అయితే, ఈ ఆనందం కాసేపటికే ఆవిరైపోయింది. అప్పటి వరకు ఒక్కో షేరు రూ.2.14 కోట్లు చొప్పున 1,312 షేర్ల విలువ రూ.2,817 కోట్లుగా చూపించగా.. కాసేపటికే ఆ అంకెలన్నీ మాయమై పాత విలువనే చూపించాయి. ఒక్కో షేరు 63 పైసల చొప్పున రూ 826.56 పైసలుగా చూపించింది. హర్సిల్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ షేర్ల విషయంలో వినోద్ డోంగ్లేకు ఈ విచిత్ర అనుభవం ఎదురైంది. కాసేపే అయినా అంకెల్లో తను బిలియనీర్ ను అయ్యానని వినోద్ డోంగ్లే సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్ గది ఇదే.. నెట్టింట ఫుల్ ట్రెండ్
Follow Us
వైరల్ వీడియోలు
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

