నదిలో కుప్పలుగా శిశువుల మృతదేహాలు !! పోలీసుల విచారణలో సంచలన విషయాలు

|

Nov 29, 2022 | 9:31 AM

మహారాష్ట్రలోని వాన్ నదిలో శిశువుల మృత దేహాలు కనిపించడం పెను సంచలనం రేపింది. చనిపోయిన చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు నదిలో వదిలేశారు.

మహారాష్ట్రలోని వాన్ నదిలో శిశువుల మృత దేహాలు కనిపించడం పెను సంచలనం రేపింది. చనిపోయిన చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు నదిలో వదిలేశారు. బుల్దానా జిల్లా సంగ్రామ్‌పూర్ తాలూకా కొలాడ్ గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న తమ్‌గావ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టగా వారికి సంచలన విషయాలు తెలిశాయి. పెద్ద ఎత్తున అక్రమ అబార్షన్ రాకెట్ మొదలైనట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలియగానే నది వద్దకు గ్రామస్థులు భారీగా చేరుకున్నారు. గిరిజనుల ప్రాబల్య ప్రాంతాల్లో బోగార్ వైద్యులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారని స్థానిక ప్రజలు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి వైద్యులు ఎక్కువగా అక్రమ అబార్షన్ రాకెట్‌ను నడుపుతున్నారని, అలా చేసి చనిపోయిన శిశువుల అవశేషాలను నదిలో పడేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయమై తమ్‌గావ్ పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో అక్రమ అబార్షన్ రాకెట్ చురుగ్గా సాగుతున్నట్లు పోలీసులు అంగీకరించినా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదని తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విధి ఆడిన వింత నాటకంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరోయిన్ బలి !!

Auto Ramprasad: ఆటో రాంప్రసాద్‌కు సర్జరీ !! ఏమైందంటే ??

TOP 9 ET News: అఖండ 2 పై అప్డేట్ ఇచ్చిన బాలయ్య | డైరెక్టర్ బుచ్చిబాబుకు.. చెర్రీ బంపర్ ఆఫర్

జూ నుంచి తప్పించుకోబోయిన హిప్పో !! అడ్డుకున్న సెక్యూరిటీగార్డ్‌పై..

ఆ గ్రామంలో ఓటు వెయ్యకపోతే ఫైన్‌ వేస్తారట !! ఎక్కడ అంటే ??

 

Follow us on