అర్ధరాత్రి వేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపిన కాంతులు.. కారణం ఇదే
అర్ధరాత్రి వేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతులు కనిపించాయి. మొదట వాటిని బాణాసంచా కాల్పులు అనుకున్న స్థానికులు ఆ కాంతి పుంజాలు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తూ మండుతున్న గీతలను చూసి జనం ఆశ్చర్యపోయారు. అది ఉల్కాపాతమా లేక అంతరిక్ష శిథిలాలా? అన్నది అర్థం కాలేదు. ఈ కాంతి వెలుగుల వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 1.20 గంటల సమయంలో ఆకాశంలో ఈ కాంతి పుంజాలు కనిపించాయి. మండుతున్న గీతల మాదిరిగా దూసుకొచ్చాయి. ఆకాశంలో మెల్లగా వెళ్తున్న చిన్న చిన్న లైట్ల మాదిరిగా కొంతసేపు కనువిందు చేశాయి. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్ ప్రాంతాల్లో ఇవి కనిపించాయి. నైట్ షిఫ్ట్ల తర్వాత ఇళ్లకు వెళ్లే వారు వీటిని చూసి ఆశ్చర్యపోయారు. ఇవి ఉల్కాపాతమని చాలామంది భావించారు. అయితే చైనాకు చెందిన సీజెడ్-3బీ రాకెట్ శకలాలు భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు ఇలా మండినట్లు గ్రోక్ పేర్కొంది. కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ కాంతి పుంజాల వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష రూపాయలకే 5 బుల్లెట్ బైక్లు.. కొనుగోలు బిల్లు వైరల్
ఇది కదా స్మార్ట్ వర్క్ అంటే.. అతని టెక్నిక్కి అవాక్కవ్వాల్సిందే
మమ్మీల పుట్టిల్లు ఈజిప్ట్ కాదు.. చైనా
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్కు వచ్చి.. ఆర్టిస్ట్కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

