అర్ధరాత్రి వేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపిన కాంతులు.. కారణం ఇదే
అర్ధరాత్రి వేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతులు కనిపించాయి. మొదట వాటిని బాణాసంచా కాల్పులు అనుకున్న స్థానికులు ఆ కాంతి పుంజాలు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తూ మండుతున్న గీతలను చూసి జనం ఆశ్చర్యపోయారు. అది ఉల్కాపాతమా లేక అంతరిక్ష శిథిలాలా? అన్నది అర్థం కాలేదు. ఈ కాంతి వెలుగుల వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 1.20 గంటల సమయంలో ఆకాశంలో ఈ కాంతి పుంజాలు కనిపించాయి. మండుతున్న గీతల మాదిరిగా దూసుకొచ్చాయి. ఆకాశంలో మెల్లగా వెళ్తున్న చిన్న చిన్న లైట్ల మాదిరిగా కొంతసేపు కనువిందు చేశాయి. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్ ప్రాంతాల్లో ఇవి కనిపించాయి. నైట్ షిఫ్ట్ల తర్వాత ఇళ్లకు వెళ్లే వారు వీటిని చూసి ఆశ్చర్యపోయారు. ఇవి ఉల్కాపాతమని చాలామంది భావించారు. అయితే చైనాకు చెందిన సీజెడ్-3బీ రాకెట్ శకలాలు భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు ఇలా మండినట్లు గ్రోక్ పేర్కొంది. కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ కాంతి పుంజాల వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష రూపాయలకే 5 బుల్లెట్ బైక్లు.. కొనుగోలు బిల్లు వైరల్
ఇది కదా స్మార్ట్ వర్క్ అంటే.. అతని టెక్నిక్కి అవాక్కవ్వాల్సిందే
మమ్మీల పుట్టిల్లు ఈజిప్ట్ కాదు.. చైనా
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

