హాస్పిటల్‌లో హోమం.. పరేషానైన ప్రజానీకం

Updated on: Mar 30, 2023 | 9:00 PM

వైద్యులనే దేవుళ్లుగా కొలుస్తారు.. అలాంటి డాక్టర్లే దైవంపై భారం వేసి పూజలు చేశారు. ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో ఏకంగా హోమం నిర్వహించారు.

వైద్యులనే దేవుళ్లుగా కొలుస్తారు.. అలాంటి డాక్టర్లే దైవంపై భారం వేసి పూజలు చేశారు. ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో ఏకంగా హోమం నిర్వహించారు. నలుగురు వ్యక్తులు హోమ గుండం చుట్టూ కూర్చొని హవన్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్పిటల్ లాబీలా కనిపిస్తున్న ప్రదేశంలో ఈ హోమాన్ని నిర్వహించినట్టు స్పష్టంగా కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన.. ఆసుపత్రిలోని రోగుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ద్వారకాలోని మణిపాల్ హెల్త్ హాస్పిటల్ భవనంలో ఇటీవల హోమం నిర్వహించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న రోగి ఆరోగ్యం కోసం ఇది నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నోరూరించే చాకోలెట్స్.. కేక్స్ అనుకుని తినేరు.. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు

అశ్లీల వీడియోలు పంపినందుకు.. 188 నెలల జైలు !!

Published on: Mar 30, 2023 09:00 PM
Loading...
Unable to load recommendations.
Follow Us