బ్రతుకు పోరాటం..తాళ్ల పై నడుస్తూ ప్రమాదకర ప్రయాణం.. ఎక్కడంటే(Video)
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయింది. అయినప్పటికీ నేటికీ కనీస సదుపాయాలకు దూరంగా ఉన్న అనేక గ్రామాలున్నాయి. తాగడానికి నీరు, రవాణా సౌకర్యాలు వంటి కనీస సదుపాయాలకు ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు అనేకం ఉన్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయింది. అయినప్పటికీ నేటికీ కనీస సదుపాయాలకు దూరంగా ఉన్న అనేక గ్రామాలున్నాయి. తాగడానికి నీరు, రవాణా సౌకర్యాలు వంటి కనీస సదుపాయాలకు ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలోని మన్యం జిల్లాల్లో అనేక గ్రామాలు రహదారి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.. స్కూల్ కు వెళ్లాలన్నా, అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలన్నా, గర్భణీ స్త్రీలైనా అనేక ఇబ్బందులు పడాల్సిందే.. తాజాగా అల్లూరి జిల్లాలో వాగు దాటడం కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తాళ్ళపై ప్రయాణం చేస్తున్నారు కొంతమంది గ్రామస్థులు. జిల్లాలోని రంపచోడవరం బందమామిడి గ్రామస్తులు రహదారి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాగు మీద వంతెన లేకపోవడంతో.. స్టూడెంట్స్ స్కూల్ కు వెళ్లాలన్నా, గ్రామస్తులు ఏదైనా పనికోసం గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా వాగుని దాటడం కోసం తాళ్లను ఆశ్రయిస్తున్నారు. తాళ్లపై నడుచుకుంటూ ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు. తమ గ్రామం నుంచి రంపచోడవరం వెళ్లాలంటే రోడ్లు సదుపాయం లేక, ఉన్న రహదారి చాలా దూరం కావడంతో.. గిరిజనులు వాగుపై తాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. తాళ్లనే బ్రిడ్జిగా చేసుకుని ప్రమాదకర స్థితిలో ప్రయాణిస్తున్నారు. తాళ్లపై సర్కస్ ఫీట్లు చేస్తూ .. నానా అవస్థలు పడుతున్నారు.
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

