Srikakulam : ఆటోలోంచి కురిసిన కాసుల వర్షం.. మొత్తం రూ.500 నోట్లు..

|

Mar 06, 2023 | 9:17 AM

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం టోల్‌ప్లాజా వద్ద కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. శ్రీకాకుళం టు నరసన్నపేట రోడ్‌లో టోల్‌ప్లాజా వద్ద రోడ్డుపై ఆటో నుంచి రెండుసార్లు కరెన్సీ నోట్లు పడిపోయాయి. అన్నీ రూ. 500 నోట్లే ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం టోల్‌ప్లాజా వద్ద కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. శ్రీకాకుళం టు నరసన్నపేట రోడ్‌లో టోల్‌ప్లాజా వద్ద రోడ్డుపై ఆటో నుంచి రెండుసార్లు కరెన్సీ నోట్లు పడిపోయాయి. అన్నీ రూ. 500 నోట్లే ఉన్నాయి. టోల్‌ ప్లాజా చివరి బూత్‌ వద్ద ఒకసారి, దానికి వంద మీటర్ల దూరంలో మరోసారి కిందపడిపోయాయి కరెన్సీ నోట్లు. అయితే, నోట్లు పడిపోయిన విషయాన్ని గుర్తించిన టోల్‌ ప్లాజా సిబ్బంది.. ఆటో వెంట పరుగులు తీసి పిలిచినా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు డ్రైవర్‌.రోడ్డు పై పడిన సుమారు రూ.88 వేలను కలెక్ట్ చేసి నరసన్నపేట పోలీసులకు అప్పజెప్పారు టోల్ ప్లాజా సిబ్బంది. అయితే, కావాలనే నోట్లను వెదజల్లారా లేదా పొరపాటున ఆటో నుండి జారీ పడ్డాయా అనేది మిస్టరీగా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 06, 2023 09:17 AM