GST Notice to Farmer: రూ.కోటి టాక్స్ కట్టాలంటూ రాజస్థాన్ రైతుకు జీఎస్టీ నోటీస్..! వీడియో
రాజస్థాన్లోని ఓ రైతుకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఢిల్లీలో 90 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు చేశాడంటూ జీఎస్టీ అధికారులు నోటీసులు పంపించారు. ఇందుకు గాను అక్షరాల
రాజస్థాన్లోని ఓ రైతుకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఢిల్లీలో 90 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు చేశాడంటూ జీఎస్టీ అధికారులు నోటీసులు పంపించారు. ఇందుకు గాను అక్షరాల ఒక కోటి 39లక్షల 79వేల 407 రూపాయలు పన్నుగా కట్టాలంటూ నోటీసులో పేర్కొన్నారు. దీంతో చేయని వ్యాపారానికి నోటీసులు ఎంటని అతడు లబోదిబోమంటూ.. కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. జైసల్మేర్లోని సామ్ గ్రామానికి చెందిన అశోక్ కుమార్ అనే యువరైతుకు ఈ నోటీసులు అందాయి. జనవరి 5న జీఎస్టీ విభాగం నుంచి నోటీసులు అందాయి. దీనిపై సంబంధిత అధికారులను కలిసినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఢిల్లీలోని ఓ సంస్థ అతని పాన్కార్డ్తో లావాదేవీలు చేస్తోందని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై ఫిర్యాదు చేశానని. తన వ్యక్తిగత వివరాలను జీఎస్టీ అధికారులకు అందించానని బాధితుడు తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife Murder: వీడేం మొగుడు.. భార్య అందంగా ఉందని చంపేసిన భర్త.. పెళ్లైన ఆరు నెలలకే..!
TOP 9 ET News: NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే! | డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా.!
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు
చేపల కోసం వల వేస్తే చిక్కింది చూసి జాలరి షాక్
సైకిల్పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరి చరిత్ర సృష్టించిన టీచర్
అర్చకుల విదేశీయానం ధర్మ విరుద్ధమా ??
ప్రాణం తీసిన చేప.. మృతి వెనుక అసలేం జరిగింది ??
బురఖాలో వచ్చింది.. గన్ బయటకు తీసింది.. ఆ తర్వాత..

