దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజ్ పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా యేవాలా తాలూకాలోని పటోడాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ధోరణి వెలుగులోకి వచ్చింది. టీనేజర్స్కు ఇవ్వాల్సిన కోవాగ్జిన్ కు బదులు ఓ విద్యార్ధికి కోవిషీల్డ్ టీకా వేశారు. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.