Chennai Metro Ad: మెట్రోరైల్లో యాడ్‌ చూసి మహిళలు ఫైర్.. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందో తెలుసా!

Updated on: Sep 09, 2026 | 4:49 PM

చెన్నై మెట్రో రైళ్లలో ప్రదర్శించిన ఓ ఎఫ్‌డీ ప్రకటన తీవ్ర వివాదానికి దారితీసింది. గర్ల్‌ఫ్రెండ్‌ ప్రేమను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీతో పోలుస్తూ రూపొందించిన పోస్టర్‌పై మహిళలను కించపరిచేలా ఉందంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, సీపీఎం నేతలు ప్రకటనను తీవ్రంగా ఖండించారు. పోస్టర్లను వెంటనే తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రకటనలపై కఠిన పర్యవేక్షణ అవసరమని కోరుతున్నారు.

చెన్నై మెట్రో రైళ్లలో ప్రదర్శించిన ఓ వాణిజ్య ప్రకటన తీవ్ర వివాదానికి దారి తీసింది. మహిళలను కించపరిచేలా, ఒక వస్తువుగా చూపేలా ఉందంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరువళ్లువార్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ప్రచారం కోసం ఈ యాడ్‌ను రూపొందించింది. “గర్ల్‌ఫ్రెండ్ మీకు 0% వడ్డీ ఇవ్వొచ్చు. కానీ మా ఎఫ్‌డీ 14.40% వడ్డీ ఇస్తుంది” అనే అభ్యంతరకర వాక్యాలతో ఈ పోస్టర్‌ను మెట్రో కోచ్‌లలో ప్రదర్శించారు. మహిళల ప్రేమను, సంబంధాలను ఆర్థిక వడ్డీతో పోల్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. డిఎంకే ఎంపీ తమిళచ్చి తంగపాండియన్, అన్నాడీఎంకే ప్రతినిధి కోవై సత్యన్, సిపిఎం ఎంపీ వెంకటేశన్ తదితరులు ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్న ఇలాంటి ప్రకటనలకు చెన్నై మెట్రో అడ్మినిస్ట్రేషన్ ఎలా అనుమతి ఇచ్చిందని వారు నిలదీశారు. ఈ పోస్టర్లను వెంటనే తొలగించాలని, బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. సృజనాత్మకత పేరుతో మహిళలను కించపరిచే ప్రకటనల పట్ల ప్రజా రవాణా వ్యవస్థలు మరింత కఠినమైన పర్యవేక్షణ ప్రమాణాలు పాటించాలనే డిమాండ్ ఇప్పుడు సర్వత్రా ఊపందుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

300 ఏళ్ల తర్వాత రామప్ప ఆలయంలో అరుదైన ఘట్టం..

పోలేరమ్మ గుడిలో అద్భుతం.. అమ్మవారి విగ్రహంపై మరో రెండు కళ్లు ప్రత్యక్షం

పేకమేడల్లా కూలుతున్న భవనాలు.. హస్తినలో డేంజర్‌ బెల్స్‌

 

Published on: Sep 09, 2026 04:02 PM
Loading...
Unable to load recommendations.
Follow Us